- Advertisement -
మమతాబెనర్జీ
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు బిజెపి కుట్రపన్నుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శించారు. మాల్దాలో ఏడుగురు న్యాయాధికారులను దిగ్భంధించిన ఘటనను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మాల్దా ఘటన గురించి అధికారులెవ్వరూ నాకు సమాచారం ఇవ్వలేదు. ఒక విలేకరి ద్వారానే ఈ విషయం తెలిసింది. ప్రధాన కార్యదర్శి ఇప్పటికీ నాకు ఫోన్ చేయలేదు’ అని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ మమత తెలిపారు. అలాగే, హింసకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



