- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని సీతాయిపేట గ్రామములోని హనుమాన్ మందిరం వద్ద విడిసి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూమేష్, ఎంపిఓ రాజేష్ ప్రారంభించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో గ్రామస్థులు సౌకర్యం కొరకు అలాగే తమ గ్రామము గుండా ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజల దాహర్తి తీర్చేందుకు విడిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమములో మాజీ సొసైటీ డైరెక్టర్ సభవత్ శ్రీనివాస్, పంచాయతీ కార్యవర్గ సభ్యులు, విడిసి సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



