- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆఫ్రికాలోని సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో గోల్డ్ మైన్ కుప్పకూలి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో సుమారు 100 మందికిపైగా సమాధి అయినట్లు మైనింగ్ అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, మరికొందరి అచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో బయటపడొచ్చని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
- Advertisement -



