Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పనపల్లిలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు. మృతులు బలవంతపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు భాగ్య, రాజు, వారి పిల్లలు నియాన్ష్, శాన్విక అని పోలీసులు తెలిపారు. బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టం నిమిత్తం దుబ్బాక ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో బలవంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -