కాటారంలో జయంతి వేడుకలు
నవతెలంగాణ – కాటారం
డా. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక విప్లవ యోధుడిగా, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడిగా నిలిచారని, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి దీప్తి అని మహనీయుల ఉత్సవ కమిటీ కన్వీనర్ కరుణాకర్ రావు అన్నారు.
కాటారం మండల కేంద్రంలో ఆదివారం డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం కమిటీ కన్వీనర్ కరుణాకర్ రావు మాట్లాడుతూ… డా. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక విప్లవ యోధుడిగా, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి దీప్తి అని అన్నారు.
దేశానికి మాజీ ఉప ప్రధాని గా సేవలందించిన ఆయన చూపిన మార్గం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తోందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలనే ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, కాటారం సర్పంచ్ పంతకాని సడువలి, కాటారం ఉప సర్పంచ్ కొండగొర్ల బాణయ్య, మాజీ ఎం పీ పీ పంతకాని సమ్మయ్య, మాజీ ఎం పీ టీ సీ జాడి మహేశ్వరి, కాంగ్రెస్ నాయకులు చీమల సందీప్, కడారి విక్రమ్, బీజేపీ మండల అధ్యక్షులు పాగే రంజిత్, ఆత్మకూరి కుమార్, కుమ్మరి అశోక్, గంట దేవదాస్, భూపల్లి రాజు, జక్కు శ్రవణ్ , నౌళ్ళ సంపత్, బొబ్బిలి వెంకన్న, పంచాయతీ కార్యదర్శి బిరెల్లి కర్ణాకర్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



