కొల్కతా: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, ప్రముఖ మహిళా ఉద్యమ నాయకులు బనానీ బిశ్వాస్ (87) కన్నుమూశారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు మైనాక్ బిశ్వాస్ ఉన్నారు. ఆమె అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం, లెఫ్ట్ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొనినికా ఘోష్ సహా వందలాది మంది ఘన నివాళులర్పించారు.
ఆమె కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నగరంలో అంతిమయాత్ర నిర్వహించి అనంతరం వైద్య పరిశోధనల నిమిత్తం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగించారు. బెంగాల్ మహిళా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బినానీ బిశ్వాస్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా)లో సుదీర్ఘకాలం కేంద్ర ఆఫీస్ బేరర్గా పనిచేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులుగానూ, కంట్రోల్ కమిషన్ సభ్యులుగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు బనానీ బిస్వాస్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -



