- Advertisement -
– సీఎస్కు టీజీఈజేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)కు తుది రూపునిచ్చి ఖరారు చేసేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో సీఎస్ను టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, సెక్రెటరీ జనరల్ ముజీబ్ హుస్సైనీ, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ బి.శ్యామ్ తదితరులతో కూడిన ప్రతినిధి బందం కలిసింది. అనంతరం నాయకులు, వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
- Advertisement -



