Wednesday, April 8, 2026
E-PAPER
Homeజాతీయంఇండియాలో యూరియా సంక్షోభం

ఇండియాలో యూరియా సంక్షోభం

- Advertisement -

– దేశంలో అధికంగా పెరిగిన వినియోగం
– యుద్ధంతో ఎల్‌ఎన్‌జీ సరఫరా తగ్గుదల
– మోడీ సర్కారు వైఫల్యం
– ముందుచూపు లోపించడంతో తప్పని ఇబ్బందులు
– నెపం రైతులపై నెట్టే ప్రయత్నాలు
– సమస్యను త్వరగా పరిష్కరించాలి..లేకుంటే చాలా ఇబ్బందులు : నిపుణులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ :
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం పైనా, ప్రతీ రంగం మీదా పడింది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. దేశంలో ప్రధాన ఎరువైన యూరి యా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోడీ సర్కారుకు ముందు చూపు లోపించడం కారణంగానే ఈ పరిస్థితి ఎదురువుతో ందని వివరిస్తున్నారు. అలాగే రైతులు యూరియా వినియోగం పెంచారనీ, పర్యవేక్షించాల్సిన యంత్రా ంగాలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో యూరియా సంక్షోభం తీవ్రమై, అది ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు నిద్ర వీడి ప్రస్తుత సమస్యకు పరిష్కారం వెతకాలని సూచిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో జరుగుతోన్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అలాగే ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. చమురు, గ్యాస్‌ సరఫరాలో అంతరాయంతో పలు రంగాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఎల్‌ఎన్‌జీ సరఫరా తగ్గడంతో భారత్‌లో యూరియా ఉత్పత్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రైతులు ఎన్‌పీకే ఎరువుల సరైన నిష్పత్తిని పాటించడం లేదని అధికారులు చెప్తున్నారు. శాస్త్రీయంగా సరైన ఎరువు నిష్పత్తి 4:2:1 (నైట్రోజన్‌:ఫాస్పరస్‌:పొటాష్‌)గా ఉండాలి. ఇందులో నైట్రోజన్‌ భాగమే యూరియా. ఇది పంటలకు తక్షణ ఫలితాలు ఇస్తుంది కానీ దీర్ఘకాలంలో నేల సారాన్ని తగ్గిస్తుంది. యూరియాలో 46 శాతం నైట్రోజన్‌ ఉంటుంది. భారత్‌లో రైతులు అధిక దిగుబడుల కోసం యూరియాను ఎక్కువగా వాడుతున్నారు. సరైన నిష్పత్తి 4:2:1 కాగా.. ప్రస్తుతం ఇది సగటున 9:3:1కి పెరిగింది. అంటే ప్రతీ ఒక కిలో పొటాష్‌కు రైతులు 9 కిలోలకు పైగా నైట్రోజన్‌ను వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదాహరణకు, నాగాలాండ్‌లో 1కిలో పొటాష్‌కు 101 కిలోల నైట్రోజన్‌ వాడుతున్నారు. తెలంగాణలో ఇది 12.6 కిలోలుగా ఉంది. నిపుణులు చెప్తున్నదాని ప్రకారం.. రైతులు అధిక యూరియా వాడడం వల్ల నేల నాణ్యత తగ్గింది. దీంతో మరింత యూరియా అవసరం అవుతోంది. ఎల్‌ఎన్‌జీ సరఫరా తగ్గడంతో యూరియా ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. అందుకే, నిపుణులు నైట్రోజన్‌ వినియోగాన్ని 9.3 కిలలో నుంచి 4 కిలోలకు తగ్గించాలని సూచిస్తున్నారు. అయితే ఇది అమలు చేయడం సులభం కాదనీ, ఎందుకంటే నేల ఇప్పటికే నైట్రోజన్‌పై ఆధారపడే స్థితికి చేరుకుందని వారు చెప్తున్నారు.

భారత్‌ యూరియా దిగుమతులపై ఆధారపడటానికి కారణం
1960ల ముందు ఎరువుల వినియోగం చాలా తక్కువగా ఉండేది. రైతులు ప్రధానంగా సహజ పద్ధతులను అనుసరించేవారు. గ్రీన్‌ రివల్యూషన్‌ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారింది. అధిక దిగుబడుల విత్తనాలు నైట్రోజన్‌కు భాగా స్పందించాయి. ప్రభుత్వం కూడా యూరియాను ప్రోత్సహించింది. ఎందుకంటే అది చౌకగా, సులభంగా అందుబాటులో ఉండేది. 2025లో యూరియా వినియోగం 387 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. మరోపక్క ఉత్పత్తి 306 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. దీంతో మిగిలిన అవసరాన్ని భారత్‌ దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది.

‘హార్ముజ్‌’ అంతరాయం ప్రభావం
భారత్‌ యూరియాను ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలైన ఒమన్‌, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి దిగుమతి చేస్తుంది. ఈ సరఫరా హార్ముజ్‌ జలసంధిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అంతరాయం ఏర్పడటంతో సంక్షోభం మరింత పెరిగింది. ఇది ఇప్పుడు దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

అధిక యూరియా వినియోగంతో నష్టాలు
యూరియా అధికంగా వాడితే పంటలు పచ్చగా కనిపిస్తాయి. దీంతో రైతులు పంట బాగుందని అనుకుంటారు. కానీ ఫాస్పరస్‌, పొటాష్‌ లేకపోవడం వల్ల వేర్లు బలహీనపడతాయి. దీంతో మొక్కలు వ్యాధులకు గురవుతాయి. పురుగుల దాడి పెరుగుతుంది. అలాగే యూరియా అధికంగా వాడటం వల్ల నేలలోని ఇతర పోషకాలు తగ్గిపోతాయి. దీని వల్ల నేల క్రమంగా పాడవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నెపం రైతులపై.. బాధ్యత విస్మరిస్తున్న మోడీ సర్కారు
దేశంలో రైతులు మోతాదుకు మించి యూరియాను వినియోగిస్తున్నారనీ, ఇది సంక్షోభానికి కారణమవుతోందని చెప్పే అధికార యంత్రాంగాలు తమ వైఫల్యాన్ని మాత్రం కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. యుద్ధ పరిస్థితులను అంచనా వేయకపోవడం, ప్రత్యామ్నాయాలు అనుసరించకపోవడం, రైతులకు పూర్తిస్థాయి అవగాహనను కల్పించకపోవడం వంటి కారణాలకు కేంద్రంలోని మోడీ సర్కారు బాధ్యత వహించాలని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -