పట్టించుకోని అటవీ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు కీలక భూమిక పోషిస్తాయి. అనేక జంతు,వృక్ష జాతులతో జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు అడవులు తోడ్పడ తాయి.భూసారాన్ని కాపాడతాయి.ఒకవిధంగా చెప్పాలంటే మానవ మనుగడకు అడవులే ఆధారం అలాంటి అడవులకు నిప్పు పెట్టడం వలన మానవ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.ఇటు కొయ్యుర్ రేంజ్,అటు భూపాలపల్లి రేంజ్ పరిధిలోని కాపురం గుట్టల్లోని అడవుల్లో ఓసిపి కన్వేయర్ బెల్టు రహదారి ప్రక్కన గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో గత రెండు రోజులుగా అడవి కార్చిచ్చు రగులుతోంది.
అడవుల్లో భారీగా పొగ,మంటలు చెలరేగుతున్న పారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తికి చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.అటవీ అధికారులు ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు, కళాజాతతో చైతన్య కార్యక్రమాలు చేపట్టకపోగా మంటలు చెలరేగుతున్న పట్టించుకోకపోవడం గమనార్హం.
తీసుకోవాల్సిన చర్యలు..
వేసవిలో అడవిలోకి జీవాలు వెళ్లకుండా చూడాలి.అగ్గిపెట్టె, కిరోసిన్, పెట్రోల్ వంటి వాటిని అడవిలోకి తీసుకెళ్లకుండా నిషేధించాలి.ఆకులు ఎక్కువగా రాలే అటవీ ప్రాంతంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట ట్రంచ్ ఏర్పాటు చేయాలి.అటవీ ప్రాంతంలో చెక్ డ్యాంలు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చూడాలి.ఎత్తైన వాచవర్లు ఏర్పాటు చేసి మనుషులు ఆడవిలోకి రాకుండా అటవీ అధికారులు గమనించాలి.



