- Advertisement -
ఆర్టీసీ ఎండీకి ఎస్డబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి
నవతెలగాణ-హైదరాబాద్
ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికి రూ.15 లక్షల బీమా పథకాన్ని అమలుచేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధానకార్యదర్శి విఎస్ రావు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో చనిపోయిన రూ. 1.15 కోట్లు చెల్లించే పథకం ప్రస్తుతం అమల్లో ఉందన్నారు. ఈ బీమా కెయిమ్ చేయాలంటే అనేక ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. అయితే సహజమరణానికి కూడ బీమా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి వినతిపత్రం బుధవారం అందజేశారు.
- Advertisement -



