- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను గురువారం రాఘవపట్నం సర్పంచ్ కోరం రామ్మోహన్ పరామర్శించారు. వరంగల్ లలిత హాస్పిటల్ నందు రాఘవపట్నం గ్రామానికి చెందిన రామటెంకి రాజశేఖర్ మరియు ప్రవీణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతుండగా రాఘవపట్నం గ్రామ సర్పంచ్ కోరం రామ్మోహన్ బాధితులను పరామర్శించి, బాధితులతో మంత్రి సీతక్క చరవాణిలో మాట్లాడి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వైద్యశాల సిబ్బందితో మాట్లాడి వారికి నాణ్యమైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ మండల నాయకులు జాకీర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



