- Advertisement -
మండల ఇంఛార్జి ఎంపీడీఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డులున్న ప్రతి కూలికి తప్పకుండా పని పనులు కల్పించాలని మండల ఇంఛార్జి ఎంపీడీఓ శ్రీరామూర్తి ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. గురువారం తాడిచెర్లలోని కూలీలు పని చేస్తున్న పని ప్రదేశాన్ని సందర్షించారు. కూలీలకు పని ప్రదేశంలో తాగునీరు, ప్రథమ చికిత్స కీట్స్, చలువ పందిళ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పని ప్రదేశంలో ప్రతి కూలి ముఖాన్ని ఫొటోతీసి ఎన్ఎంఎస్ యప్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



