Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలి 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేయాలి 

- Advertisement -

అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
నవతెలంగాణ – మిడ్జిల్
పెండింగ్ లో ఉన్న  ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేయాలని పాలమూరు అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మండల కేంద్రంతో పాటు బోయినపల్లి వాడియాల గ్రామాలలో అకస్మికతనికి నిర్వహించారు. బోయిన్పల్లి గ్రామంలో  ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, నర్సరీ, డ్రైనేజ్ సిసి రోడ్లు పరిశీలించారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, నీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

డ్రైనేజీ కాలువలు శుభ్రపరచాలని, ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందరికీ అందే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. వాడియాల గ్రామంలో  మూగజీవాలకు ఏర్పాటుచేసిన నీటితోట్లలో నీరు నింపడంతో సిబ్బందిని అభినందించారు. మండల శాఖ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతాంజలి, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులు, మధు కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -