Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధర్పల్లిలో వరి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే 

ధర్పల్లిలో వరి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
రైతులు పండించిన వరి పంటను ఎలాంటి కోతలు లేకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా  రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు. గురువారం ధర్పల్లి మండల కేంద్రంలో పి.ఏ.సి.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం వద్ద పూజలు చేసి కొనుగోలు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రైతుల వద్దకే వెళ్లి పంట కొనుగోలు చేపట్టడం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఉందో చూపెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా అనవసరపు ఆరోపణలు మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని స్వాగతించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు  అధ్యక్షులు ఆర్మూర్ బాల్ రాజు, దర్పల్లి సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, మునిపల్లి సాయి రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ముసుకు సాయి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతాపూర్ గంగాధర్,పొలసాని శ్రీనివాస్,ఉమ్మాజి నరేష్,హన్మండ్లు,కౌలాస్ మోహన్ , రాంచందర్ గౌడ్,మనోహర్ రెడ్డి,సొసైటీ మాజీ చేర్మెన్లు చెలిమేల మల్లికార్జున ,జనార్దన్ రెడ్డి,చెలిమె నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్ మంగ్త్య నాయక్ ఆయా గ్రామాల సర్పంచులు, రాజేందర్, రాజా శేఖర్ గౌడ్, మాలవత్ బాలు, రావుజీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -