నవతెలంగాణ – జుక్కల్
చుక్కల మండలంలోని కౌలాస్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఐకెపి ఆధ్వర్యంలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి గురువారం ప్రారంభించారని ఐకేపీ ఏపీఎం వాగ్మారే వందేమాతరం తెలిపారు. సందర్భంగా ఏవో మాట్లాడుతూ గ్రామాలలో వరి పండించే రైతు దళారులను ఆశ్రయించవద్దని తెలిపారు.
ఐకెపి ఎపిఎం వందేమాతరం మాట్లాడుతూ.. రేట్లు, తూకం విషయంలో దళారులు మోసాలకు పాల్పడతారని అన్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద భద్రత ఏర్పాటు ఉంటుందని, అమ్మిన వారంలోపే వారి డబ్బులు సంబంధిత రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినది అన్నారు. నిబంధనల ప్రకారం వారి తేమ శాతం వచ్చే విధంగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావాలని , రాష్ట్ర ప్రభుత్వం అందించి మద్దతు ధరకే అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలు ప్రజాప్రతినిధులు , గ్రామ మహిళా సంఘాల సభ్యులు, గ్రా పెద్దలు , రైతులు తదితరులు పాల్గొన్నారు.



