- Advertisement -
నవతెలంగాణ – జగిత్యాల టౌన్
మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం. జీవన్ రెడ్డిని తన ఇంట్లో లంచ్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానించగా కేసీఆర్ ఆహ్వానం మేరకు జగిత్యాల నుండి జీవన్ రెడ్డి బయలుదేరనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తదితరులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై, జీవన్ రెడ్డికి పార్టీలో ఇచ్చే పదవీపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
- Advertisement -



