- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
ఆయుష్ దినోత్సవ వేడుకలలో భాగంగా జుక్కల్లోని ప్రభుత్వ యునాని డిస్పెన్సరీలో శుక్రవారం ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు ‘ ప్రజా ప్రాణాలిక’లో భాగంగా యోగా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యోగ అధ్యాపకుడు మాట్లాడుతూ .. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కావున యువకులు, మహిళలు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్పత్రి సేవా బృందంతో కలిసి యోగా క్లాసులు నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
- Advertisement -



