నవతెలంగాణ – జుక్కల్
ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫామ్ పాండ్ ను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఉపాధి హామీ ఈసీ స్వామి దాస్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షపు నీరు వృధాగా పోవొద్దనే ముఖ్య ఉద్ధేశ్యంతో ఈ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. దీని వలన భూగర్భ జలాలు అడుగంటుకు పోకుండా ఉంటాయని తెలిపారు. బోరుబావులు ఎండిపోకుండా ఉండేందుకు ఇది సహకరిస్తునందన్నారు. అంతకుముందు ఉపాధి హామీ కూలీలకు పలు సూచనలు చేశారు. ఉదయం పూట 6 గంటలకు పనులకు హజరు కావాలని తెలిపారు. 11 గంటల లోపు ఉపాది పనులు ముగించుకొని ఇండ్లకు వెళ్లాలని సూచించారు. పెరిగిన ఎండల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఈసీ, తదితరులు పాల్గొన్నారు.
ఫామ్ పాండ్ పనులు పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



