Friday, April 10, 2026
E-PAPER
Homeకరీంనగర్యోగా రోజూ సాధన చేయాలి

యోగా రోజూ సాధన చేయాలి

- Advertisement -

యోగాసనాలు, ధ్యానంతో ఎన్నో ఉపయోగాల
జీవితంలో భాగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రోజూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఇతర శాఖల సంయుక్త భాగస్వామ్యంతో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం యోగా గురువు యోగాసనాలు వేయించి, ధ్యానం చేయించారు ధ్యానం, యోగాసనాలతో కలిగే లాభాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన *ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక* కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12 వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపడుతున్నామని వెల్లడించారు. మన దేశంలో పతంజలి యోగాను  ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రోజూ అరగంట నుంచి గంట సమయం పాటు వ్యాయామం, యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. దీంతో రోజు వారి పనితీరు, వృత్తి నిర్వహణకు ఉపయోగపడుతుందని తెలిపారు. యోగా జీవితంలో భాగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నో శారీరక రుగ్మతలు యోగాసనాలు, ధ్యానం సాధనతో దూరమవు తాయని చెప్పారు. యోగా అంటే జీవన విధానమని పేర్కొన్నారు.

యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇతర అన్ని వివరాలతో ఆన్లైన్లో కూడా ఎన్నో వీడియోలు, గురువుల ద్వారా నేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ కేంద్రాల్లో వీటిపై అవగాహన, శిక్షణ అందిస్తారని వెల్లడించారు. వైద్యులు చికిత్స,  మందులతో పాటుగా యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామంతో ఎన్నో ఉపయోగాలు అని ఉన్నాయని చెబుతున్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఆయుష్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ముఖ్య అతిథులను సన్మానించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు,  వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -