Saturday, April 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు20న బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌రెడ్డి

20న బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌రెడ్డి

- Advertisement -

జగిత్యాలలో భారీ బహిరంగసభ : ముఖ్యఅతిథిగా రావాలంటూ కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి విజ్ఞప్తి
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో భేటీ
మీతో కలిసి పనిచేయాలని ఆ దేవుడే పంపాడన్న మాజీమంత్రి


నవతెలంగాణ-మర్కుక్‌
మాజీమంత్రి టి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 20న ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. అదేరోజు జగిత్యాలలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తున్నది. శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను జీవన్‌రెడ్డి కలిశారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు, తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత ఆత్మీయంగా కలుసుకున్నారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈనెల 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కేసీఆర్‌ను జీవన్‌ రెడ్డి ఆహ్వానించారు. ‘మీతో కలిసి పనిచేయాలని ఆ దేవుడే తనను పంపాడు.. తిరోగమనంలో ఉన్న కాంగ్రెస్‌పై యుద్ధం చేయాలి’ అంటూ ఎమోషన్‌ అయినట్టు సమాచారం. కాగా కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. కేటీఆర్‌ ఆయనతో చర్చలు జరిపారు. గురువారం స్వయంగా జగిత్యాలకు వెళ్లి భేటీ అయ్యారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమాలకర్‌, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, బీఆర్‌ఎస్‌ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కె.విద్యాసాగర్‌రావు, మాజీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గ్యాదరి బాలమల్లు, మాజీ జిల్లా చైర్మెన్‌ వసంత తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -