నవతెలంగాణ – ఆలేరు రూరల్
మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. దేశంలో అనగారిన వర్గాల అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని నమ్మి పాఠశాలలను ప్రారంభించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళలకు విద్య అందించాలనే సంకల్పంతో తన ఇంటినే పాఠశాలగా మార్చి, తన భార్య సావిత్రిబాయ్ ఫూలే ద్వారా విద్య బోధింపజేసిన గొప్ప సంస్కర్తగా ఆయనను గుర్తుచేశారు.
కుల వివక్షలు ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకొని సత్యశోధక సమాజ్ను స్థాపించి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ నాయకులు గడ్డం నాగరాజు, బల్లేపు సంపత్ కుమార్, కొంగరి వెంకటేష్, పరస బంగారయ్య, గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గంగుల, మాజీ కోఆపరేటివ్ డైరెక్టర్ ఆరె మల్లేష్, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య, వార్డు మెంబర్ బొంకురి మల్లయ్య, తీరాల శంకర్, చాడ రాజు, ఎదునూరి భాస్కర్, మామిడాల భానుచందర్, మామిడాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



