- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిదిలోగల గొర్రెమల్లయ్యపల్లిలో ఇటీవల బోర్ మోటర్ చెడిపోయిన తాగునీటికి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ దృష్టికి తీసుకరావడంతో శనివారం చెడిపోయిన బోర్ మోటర్ కు మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్యను పరిస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -



