Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వల్లెంకుంటలో బడిబాట కార్యక్రమం.!

వల్లెంకుంటలో బడిబాట కార్యక్రమం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని వల్లెంకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాధానోపాధ్యాయులు సుదర్శనం ఆధ్వర్యంలో శనివారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవడమైనదని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా అందుతుందని, మధ్యాహ్న భోజనంతో పాటు రెండుజతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లలో వల్లెంకుంట ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించినారని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. “ప్రభుత్వ పాఠశాలల ఉండగా ప్రైవేటు బడులకు ఎందుకు డబ్బులు దండగా”అడ్మిషన్లు ప్రారంభమైనాయని తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్ నాయక్, ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు  జి.రఘువీర్ నాయక్, ఎల్. రాజు నాయక్, ఎస్.సమ్మయ్య, ఎ.కవిత, డా.రాజారావు,ఎం.ప్రకాష్, వి.నర్మద, పి.సత్యనారాయణ, స్వర్ణకుమారి, శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -