Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంతలమయమైన రోడ్డును బీటీ రోడ్డుగా చేపట్టాలి

గుంతలమయమైన రోడ్డును బీటీ రోడ్డుగా చేపట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గుంతల మయం అయిన రోడ్డును బీటీ రోడ్డుగా చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అన్నారు. శనివారం సీపీఐ(ఎం) పోరుబాటలో భాగంగా హనుమాపురం సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో హన్మాపురం నుండి అనంతరం, తాజ్పూర్ పోయే రోడ్డును గుంతలమయం అయిన రోడ్డును పరిశీలించారు.  ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ.. హన్మాపురం నుండి అనంతారం, తాజ్పూర్ వెళ్లే రహదారి ముంతలమయం కావడంతో, ఈ రోడ్డు గత నాలుగు సంవత్సరాల నుండి డాంబర్ పై గుంతలు పడి మొత్తం కంకర తేలి ఉన్నాయని అన్నారు.

ఈ రోడ్డు వెళ్తున్న లారీలు, ఆటోలు బైకులు ప్రయాణికులు  ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోయిన ఈ రోడ్డును పట్టించుకునే పాపాన పోలేదని తెలిపారు. ఈ రోడ్డు సుమారు 20 నుంచి 25 గ్రామాల ప్రజలు బీబీనగర్ ఎయిమ్స్ కు రాత్రింబగలు వెళ్తూ ఉంటారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పరిశీలన చేసి వెంటనే డాంబర్ రోడ్డు వేసి ఈ ప్రాంత ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మోటి ఎల్లయ్య , బండి శీను,రాగల రాజేశ్వర్, దయ్యాల మల్లేష్,తోటకూరి గణేష్, గ్రామ ప్రజలు బూరుగు రఘు, ముద్ద కొమరయ్య, రంగ నవీన్, బాలకృష్ణ, ఎర్రబోయిన శివ, పైల నవీన్ రెడ్డి, భరత్ రెడ్డి, మోటో వేణు, సునీల్, దయ్యాల నవీన్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -