Sunday, April 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ వారోత్సవాలు

సీఐటీయు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు అన్ని మండలాలు, గ్రామాలల్లో సామజిక న్యాయ వారోత్సవాలు నిర్వహించ‌నున్నామ‌ని దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి . సీఐటీయు జన్నారం మండల కన్వినింగ్ కమిటీ సమావేశం ఆదివారం అంబటి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శిమాట్లాడుతూ…గ్రామాన సీఐటీయు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఉద్యోగ కార్మికులు భాగస్వామ్యం కావాలన్నారు.

మహనీయులు పోరాడి సాధించిన చట్టాలను, భారత రాజ్యాంగాన్ని, హక్కులను నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కలరస్తుందాన్నారు. బీజేపీ పాలిత రాష్టాలల్లో పేదలపై, గిరిజనులపై, మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ప్రజలు, శ్రామికులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరం చేయకుండా కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా కులం, మతం, ప్రాంతం, బాషా పేర్లతో మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.

ఈ మహనీయుల పోరాట స్పూర్తితో కార్మికులు, శ్రామికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం నిజామాబాద్ పట్టణంలోని నూర్జహాన్ మరణం కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటు. నూర్జహాన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కన్వినింగ్ కమిటీ సభ్యులు లక్ష్మి, సుజాత, కృష్ణ,రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -