- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను సిమెంట్ మిక్సర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ముర్బాద్ సమీపంలోని గోవిలి గ్రామం వద్ద ఉన్న రైతా వంతెనపై కళ్యాణ్ నుంచి ముర్బాద్ వెళ్తున్న వ్యాన్, ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ వాహనం ముఖాముఖి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -


