- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నూలు సమీపంలోని ఇ.తాండ్రపాడులో గణేష్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ డీజే సౌండ్కు 36 ఏండ్ల శివమ్మ అనే మహిళ మృతి చెందింది. అధిక శబ్దం వల్లే ఆమె మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీజేల అధిక శబ్దాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ విషాదం జరిగింది.
- Advertisement -



