Saturday, June 7, 2025
E-PAPER
Homeఆటలుముగిసిన ఐపీఎల్.. విజేతల జాబితా ఇదే

ముగిసిన ఐపీఎల్.. విజేతల జాబితా ఇదే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను అలరించింది. నిన్న రాత్రి న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్‌తో టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందజేశారు. గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, మరో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచి కీలక అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఐపీఎల్‌ 2025 అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే..

  • – ఐపీఎల్‌ 2025 ఛాంపియన్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • – రన్నరప్: పంజాబ్ కింగ్స్
  • – ఆరెంజ్ క్యాప్: సాయి సుదర్శన్ (జీటీ) – 759 పరుగులు
  • – పర్పుల్ క్యాప్: ప్రసిద్ధ్ కృష్ణ (జీటీ) – 25 వికెట్లు
  • – అత్యంత విలువైన ఆటగాడు: సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ) – 320.5 MVP పాయింట్లు
  • – ఎమర్జింగ్ ప్లేయర్: సాయి సుదర్శన్ (జీటీ)
  • – సూపర్ స్ట్రైకర్: వైభవ్ సూర్యవంశీ (ఆర్ఆర్‌) – స్ట్రైక్ రేట్: 207
  • – అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్ (జీటీ) – 88 ఫోర్లు
  • – అత్యధిక సిక్సర్లు: నికోలస్ పూరన్ (ఎల్ఎస్‌జీ) – 40 సిక్సర్లు
  • – అత్యధిక డాట్ బాల్స్: మహ్మద్ సిరాజ్ (జీటీ) – 151 డాట్స్
  • – ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
  • – సీజన్‌లో ఉత్తమ క్యాచ్: కమిండు మెండిస్ (ఎస్ఆర్‌హెచ్‌) – డెవాల్డ్ బ్రెవిస్ (సీఎస్‌కే) క్యాచ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -