నవతెలంగాణ-హైదరాబాద్: బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమం వేదికగా స్పందిచారు. ఎక్స్ ఖాతాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ”ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. కుంభమేళాలో తొక్కిసలాట.. ఇప్పుడు బెంగళూరులో తొక్కిసలాట.. ఈ ఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలు చేయలేదు. పాఠాలు నేర్చుకోలేదు.. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ ఒక కప్ ఛాయ్ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారట్లేదు” అంటూ గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్కు హృదయం ముక్కలైన ఎమోజీని కూడా ఆయన జతచేశారు.
వారి ప్రాణాలు ఛాయ్ కప్ కంటే చౌకనా: హర్ష్ గోయెంకా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES