– ప్రథమ చికిత్స అందించిన వైద్యులు
– విశ్రాంతి తీసుకోవాలని సూచన
– పరామర్శించిన సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విరామం లేకుండా పనిచేయడం వల్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో కండ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సచివాలయంలోని వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. రెండ్రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు ఆమె దగ్గరకు వెళ్లి పరామర్శించారు. నియోజకవర్గంలో కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనటం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొగ్రాంలో పాల్గొన్న వెంటనే సచివాలయంలో జరిగే క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు అవసరమైన డేటాను అధికారుల నుంచి సేకరించే క్రమంలో ఆమె ఆహారం తీసుకోలేకపోయారు. దీనివల్లనే ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. వైద్యులు, సీఎం సూచన మేరకు విశ్రాంతి తీసుకునేందుకు హైదరాబాద్లోని తన నివాసానికి మంత్రి వెళ్లిపోయారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గవాసులు, జిల్లాకు చెందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. సరైన ఆహారం, విశ్రాంతి లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని తెలిపారు. తన ఆరోగ్యం నిమిత్తం వాకబు చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES