- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ బ్యారేజీలో నిన్న గల్లంతైన ఆరుగురి యువకుల మృతదేహాలను నేడు వెలికితీశారు. రక్షిత్(13), సాగర్(16), మధుసూదన్(18), రామ్ చరణ్(17), శివ మనోజ్(15), రాహుల్ (19) మృతదేహాలను బయటికి తీయించిన పోలీసులు, పోస్ట్ మార్టం కోసం మహాదేవపూర్ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన వీరంతా స్నానాలు చేసేందుకు శనివారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజి వద్దకు చేరుకున్నారు.
- Advertisement -