- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్ పరిధిలో గురువారం స్వల్ప భూకంపం సంభవించింది. లోయలోని పుల్వామా, పహల్గాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారిక భూకంప మ్యాపింగ్ డేటా ప్రకారం.. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో నమోదైంది. ఈరోజు తెల్లవారుజామున 02:36:49 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- Advertisement -


