- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



