- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐదు రోజుల వరకు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది. నేడు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూరపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు కురుస్తాయని వెల్లడించింది.
- Advertisement -



