- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. విశాఖలో ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పీవీ సింధు మాట్లాడుతూ ఈ క్రీడా ప్రాజెక్ట్ రూపకల్పనలో తనకు అండగా నిలిచి, పూర్తి మద్దతు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేశామన్నారు.
- Advertisement -



