- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు సాయంత్రం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 7.55 నుంచి 9.15 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాత్రికి శ్రీ గాయత్రి నిలయంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
- Advertisement -



