నవతెలంగాణ-హైదరాబాద్: హాజ్ యాత్ర సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు సౌదీ అరేబియాలోని మక్కాకు తరలివస్తుంటారు. దీంతో హాజ్ యాత్రికులతో ఇసుకవేస్తే రాళ్లనంత జనంతో మక్కాతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయ్యాయి. సౌదికి వచ్చే పలు విమానాల మార్గాలు కూడా ఎయిర్ ట్రాఫిక్ తో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈక్రమంలో మక్కాలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా సౌదీ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకుంది. హాజ్ యాత్రికుల రద్దీ దృష్ట్యా..పలు దేశాలకు తాత్కాలిక వీసాలను ఆదేశ ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో ఇండియా కూడా ఉందని వస్తున్న వార్తాలపై సోమవారం ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. తాము భారత్కు చెందిన హాజ్ యాత్రికులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, అందుకు సంబంధించి తమ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని పేర్కొంది.
మహ్మద్ ప్రవక్త ఆదేశానుసారం ప్రతి ముస్లిం..తన జీవితంకాలంలో ఒక్కసారైనా మక్కాని దర్శించాలని కోరుకుంటారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు హాజ్ యాత్ర పేరుతో మక్కాకు తరలివెళ్తారు.