నవతెలంగాణ-హైదరాబాద్: కొన్ని నెలలుగా హింస జరుగుతున్న మణిపూర్ లోని ఐదు లోయ ప్రాంతాలైన జిల్లాల శివార్లలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆయా ప్రాంతాల్లో మణిపూర్ పోలీసులు, సిఎపిఎఫ్, సైన్యం సమన్వయంతో జరిపిన దాడుల్లో 328 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఆరు ఎకే సిరీస్ రైఫిల్స్, 151 సిఎల్ఆర్ లు, 65 ఇన్సాస్ , మోర్టార్, పిస్టల్స్, కార్బైన్లు మరియు 5,000 కంటే ఎక్కువ రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో పోలీసుల నుండి దోచుకున్న ఆయుధాలు కూడా ఉన్నాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. మే 3, 2023న మణిపూర్లో జాతి హింస చెలరేగినప్పటి నుండి పోలీసు ఆయుధశాలల నుండి సుమారు 6,000 ఆయుధాలు, లక్షలాది మందుగుండు సామగ్రి దోచుకోబడ్డాయి. పోలీసులు, భద్రతా దళాలతో సహకరించాలని, అక్రమ ఆయుధాలకు సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సెంట్రల్ కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని ప్రజలను కోరారు.
మణిపూర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES