Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయం’వందే భారత్’లో వాటర్ లీక్..

’వందే భారత్’లో వాటర్ లీక్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ ట్రైన్ల గురించి తరచూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా ఏసీ కోచ్ లో వాటర్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి వెళ్లే వందే భారత్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది. ట్రైన్ లో ఏసీ పనిచేయకపోవడంతో అక్కడ వాటర్ లీకేజ్ అయింది. దీన్ని ధర్మిల్ మిశ్రా అనే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

తాను వందే భారత్ లో జర్నీ చేస్తున్న టైమ్ లో ఏదో వాటర్ ఫాల్ లాగా ఇలా వాటర్ లీక్ అయిందని.. తాను కూర్చున్న సీట్ మొత్తం నానిపోయిందంటూ తెలిపాడు. అధికారులకు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదని తన డబ్బులు రిటర్న్ చేయాలంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -