నవతెలంగాణ-హైదరాబాద్: జాన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ బీజేపీపై ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. రానున్న బీహార్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టారని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా మన దేశ ఆర్మీ బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కొన్ని రోజులకే..పాక్ విన్నపంతో కాల్పుల విమరణకు ఒప్పుకున్నామని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చెప్పారని, కానీ అంత తొందరగా ఎందుకు కాల్పుల విరమమణ ఒప్పందానికి అంగీకరించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మే 10న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కేంద్రంగా వెలిసిన ఉగ్రశిబిరాలపై ఇండియన్ ఫైటర్ జెట్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి, దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆక్రమించడమే తమ లక్ష్యామని పార్లమెంట్ వేదికగా హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. యుద్ధ కాల పరిస్థతులు తమ దేశ బలగాలకు అనుకూలంగా ఉన్నా..అంత తొందరగా ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారని ప్రశ్నించారు.
అంతేకాకుండా తన వల్లనే రెండు దేశాల మధ్య ముగిసిందని యూఎస్ అధ్యక్షుడు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్న..ఎందుకు మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తుందని మండిపడ్డారు. అమెరికా జోక్యంలేకుండానే కాల్పుల విరమణ జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్పడం హాస్యస్పాదంగా ఉందన్నారు. ట్రంప్ వాణిజ్యం పేరుతో రెండు దేశాలతో ఆట ఆడుకున్నారని, యూఎస్ ప్రయోజనాలకు కోసం ఇదంతా చేశారని కిషోర్ మండిపడ్డారు.