నవతెలంగాణ – బాల్కొండ
తపాలా శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని గ్రామ ఉప తపాలా కార్యాలయంలో పోస్టల్ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ అధికారులు మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ లోని పథకాలు, గ్రామీణ తపాలా జీవిత బీమా, తపాలా జీవిత బీమా, స్మాల్ సేవింగ్స్ ఖాతా, సుకన్య సమృద్ధి ఖాతా, ప్రజా భవిష్య నిధి ఖాతా, ఆధార్ ద్వారా చెల్లింపులు, ప్రమాద బీమా తదితర పథకాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అద్యక్షులు పోశెట్టి, పంచాయతీ అసిస్టెంట్ ప్రభాకర్,సబ్ పోస్ట్ మాస్టర్ శ్వేత ,ఆర్మూర్ సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీర్ దశరథ్,చంద్రశేఖర్, అంగన్వాడి టీచర్స్,ఆశ కార్యకర్తలు,గ్రామ ప్రజలు, తపాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పోస్టల్ పథకాలపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES