- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
గోవిందరావుపేట గ్రామంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ సంస్థ ఈ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రజని, లింకు వర్కర్ టీ. కిషన్, రాము మాట్లాడుతూ.. ఈ వర్షకాలం సీసన్ వ్యాధులతో బాధపడకుండా అన్ని టెస్టులతో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయిస్తున్నాము కావున గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయన్ఎం శకుంతల, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .
- Advertisement -