- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫన్లు పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధ్యత యజమానులకు అప్పగించినట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం రైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్ లను సెల్ ఫోన్ ఐఎం ఈఐ నంబరను సీఈఐఆర్ పొర్టల్ ద్వారా ఆన్లైన్ చేసి సెల్ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు ఆ తర్వాత బాధితులకు అందజేశామన్నారు. తొడ్పాటు అందించిన సుప్రియ, సలావుద్దీన్ లను అభినందించారు.
- Advertisement -