నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువనగిరి మండలం జిల్లా సమాఖ్య కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రణాళిక లక్ష్యం ప్రకారం విజయవంతం చేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా విస్తరంగా మొక్కలు నాటడం ద్వారా వృక్ష సంపద పెంచాలని, మానవ మనుగడకు మొక్కలు ప్రాణాధారమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్ , జిల్లా విజిలెన్స్ అధికారి యం ఉపేందర్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ , యం.పి.ఓ దినాకర్, ఏ.పి.ఓ బాలస్వామి, జిల్లా సమాఖ్య కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
మండల జిల్లా సమాఖ్య కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES