- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి కామారెడ్డి పట్టణానికి చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుష్మ శ్రీనివాస్ రెడ్డి రూ..2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకరప్ప, రామాలయ కమిటీ సభ్యులు చిన్న భూమిరెడ్డి, కొండల్ రెడ్డి, శశి కుమార్, మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -