- Advertisement -
– ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజభాషా విభాగం ఏర్పడి 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ”దక్షిణ సంవాదం” పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ అఫిషియల్ లాంగ్వేజెస్ సంయుక్త కార్యదర్శి మీనాక్షి జోలి తెలిపారు. గురువారం సికింద్రాబాద్లోని సీసీజీ టవర్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హిందీని మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపితమైన ఈ విభాగం జూన్ 26 నాటికి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుందని చెప్పారు.
- Advertisement -