- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ పట్టణంలో రేపు ఊర పండుగ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఊరేగింపు ఖిల్లా చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి వివేకానందు స్టాచ్యూ గాజులపేట, గురుద్వారా నుండి లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ నుండి వేరు , వేరుగా వినాయక నగర్ దుబ్బా వైపులుగా వెళ్లిపోవును.కావున బోధన్ వైపు నుండి వచ్చే, బోధన్ వైపు వెళ్లే వాహనాలు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోధన్ బస్టాండు, నెహ్రూ పార్క్, గాంధీచౌక్ నుండి బస్టాండ్ వైపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా వెళ్లాలి. ఈ విషయాన్ని నిజామాబాద్ నగర ప్రజలు గమనిస్తూ తమ యొక్క ప్రయాణాలు జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -