- Advertisement -
నవతెలంగాణ – నాంపల్లి: బీసీ సంక్షేమ సంఘం నాంపల్లి మండల మహిళా అధ్యక్షురాలి గా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన బిరుదొజు యాదమ్మ (ఉష) ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా యాదమ్మ మాట్లాడుతూ.. తన పై నమ్మకం తో మండల మహిళా అధ్యక్షురాలుగా నియమించిన జాజుల శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కుందారం గణేష్ చారి, విక్రం, శ్యాం కురుమ, సిద్దాంతం శ్యామల, నాగరాజు, రాజేందర్, సుజాత, సంధ్య, మంజుల, శేఖరాచారి, శారద, మరమ్మ, పుష్ప, శైలజ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -