- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ థ్రీ వేదికగా జూన్ 29 ఆదివారం నాడు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రొడిజీ 2025లో పద్మారావు నగర్లోని SIP ABACUS విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి ఈ బ్రాంచిను అగ్రస్థానంలో నిలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పద్మరావునగర్ బ్రాంచ్ కు చెందిన ఎల్సిఎల్ కె. అనురాధరాజినీకాంత్, సిఐలైన సుచరిత, కవిత, విద్య, సంఘమిత్రలతో కలిసి జూలై 15 మంగళవారం నాడు prodogy-2025లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా పద్మరావునగర్ సిప్ అబాకస్ యాజమాన్యం తల్లిదండ్రులు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -