- Advertisement -
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) హైదరాబాద్ సర్కిల్ తెలంగాణ వ్యాప్తంగా సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యా సంస్థలు, ఎన్జీవోలు, కార్యాలయాలు, మాల్స్, మెట్రో స్టేషన్లు, పార్కులలో పౌరులకు డిజిటల్ భద్రత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో గురువారం కోఠిలోని లోకల్ హెడ్ ఆఫీస్ నుంచి మూడు మొబైల్ పబ్లిసిటీ వ్యాన్లను ఆ బ్యాంక్ సిజిఎం రాధాకృష్ణన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ వ్యాన్లు రాష్ట్రవ్యాప్తంగా సైబర్ మోసాల నివారణపై ప్రచారాన్ని కల్పిస్తాయి.
- Advertisement -