- Advertisement -
నవతెలంగాణ – మెదక్ టౌన్
జూలై 21 సోమవారం బోనాల పండుగ సెలవు దినాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ ప్రభుత్వ సెలవు దినంగా ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలు ఉండవని, వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. ఈ నెల 28వ తేదీ సోమవారం యధావిధిగా కలెక్టరేట్ లో ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని సూచించారు.
- Advertisement -